GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.