AP: రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ‘జై ఆంధ్రా’ అంటూ కవిత నినాదం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి 4 నెలలు వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. శ్రీవారి దయతో సత్యం తన వైపు ఉండటంతో.. ఆ కేసును కోర్టు కొట్టేసిందన్నారు. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో.. స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చామన్నారు.