WGL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నర్సంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.