KDP: మైదుకూరుకు చెందిన 25 ఏళ్ల మహిధర్ 3 రోజుల క్రితం పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు అతని తండ్రి మారుతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల వద్ద కూడా లేకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, పోలీసుల సహాయం కోరారు. మహిధర్ బ్రహ్మంగారిమఠం ప్రాంతంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.