NZB: డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య పరిశీలించారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.