MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో గ్రామ, మండల స్థాయి సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్రత్యేక ప్రణాళికలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.