కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా గురువారం భైరవ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ జంటలతో హోమ కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. భక్తులు బహుళ అష్టమి రోజున భైరవ హోమం చేసినచో కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాల్గొన్నారు.