BDK: మణుగూరు మండలంలోని శివలింగాపురం ఆలయంలో శ్రీరామనవమి వేడుకల అంబరాన్ని అంటాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ముత్తయిదువులు సంప్రదాయబద్ధంగా రోకలికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ పసుపు కొమ్ములను దంచి, పవిత్రమైన పసుపును సిద్ధం చేశారు. ఈ పసుపును కళ్యాణ తలంబ్రాల్లో వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.