JGL: వెల్గటూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు. సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు.