NRPT: ధన్వాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తైబజార్ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో జట్ల గోవర్ధన్ గౌడ్ రూ.5.12 లక్షలకు పాటను దక్కించుకున్నారని కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆదాయం గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని సర్పంచ్ జ్యోతి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.