AP: PNG వాడకాన్ని పెంచేందుకు ఏడాదికి రూ.2400 సబ్సిడీ ఇచ్చేలా DBT పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. LPGపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులను సరళం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల PNG కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, వాణిజ్య, పరిశ్రమలకు విస్తరిస్తామన్నారు.