SDPT: వర్గల్ మండలం వేలూరు గ్రామంలో కుక్కల దాడిలో 23 మేక పిల్లలు మృతి చెందాయి. బుధవారం రైతులు మల్లేశం, కృష్ణ మేకలను మేతకు తీసుకెళ్లి, పిల్లలను దొడ్డిలోనే ఉంచారు. ఈ క్రమంలో వీధి కుక్కలు మేకల దొడ్డిలో దూరి పిల్లలను చంపేశాయి. సాయంత్రం వచ్చి చూసేసరికి మూగజీవాలు రక్తపు మడుగులో ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.