WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో జేఏసీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని విమర్శించింది. బుధవారం జేఏసీ ఛైర్మన్ కొలిశెట్టి రంగయ్య, వైస్ ఛైర్మన్ గొలనకొండ వేణు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు ఎప్పటికప్పుడు వేతన సవరణలు, సమస్యల పరిష్కారం జరగలేదన్నారు.