NGKL: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పంట రుణాలను విరివిగా అందించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలన్నారు.