SDPT: గజ్వేల్లోని ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. పిల్లలు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.