PDPL: హైదరాబాద్లో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన సీఎం కప్’వుషు’,కిక్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో శ్రావ్యంజలి, సిరి చందన, అనన్య, శ్రావ్య, రాజ్కుమార్ పతకాలు సాధించారు. విజేతలను జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్, కోచ్ రాజుమార్ తదితరులు అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.