NLG: విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మునుగోడు లైన్స్ క్లబ్ అధ్యక్షులు నారబోయిన రవి అన్నారు. లయన్స్ క్లబ్, మునుగోడు వారి ఆధ్వర్యంలో మంగళవారం పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీఐ రాములు, తహసీల్దార్ నరేష్, ఎస్సై ఇరుగు రవి, రాజీవ్ రెడ్డి, శివకుమార్, సర్పంచ్ రామాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.