PDPL: రామగుండం ఓల్డ్ బజార్కు చెందిన కుసుమ కుమారి ఇంటి ముందు నిలబడి ఉండగా దుండగులు తెగబడ్డారు. ‘అక్కా బాగున్నావా’ అని పలకరిస్తూనే, రెప్పపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని బైక్పై పరారయ్యారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.