HYD: స్త్రీనిధి సంస్థ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, రికవరీ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1947 కోట్లు, ఈ ఏడాది ఇప్పటికే రూ.2064 కోట్లు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.