ASF: కెరమెరి మండలంలోని 31 గ్రామాల్లో 623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, గృహాలతో పాటు తప్పనిసరిగా టాయిలెట్లు నిర్మించుకోవాలని MPDO సురేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనలో భాగంగా ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.