ADB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.