GDWL: మల్దకల్ మండలం మద్దెలబండలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను చిన్న రథంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.