JGL: జగిత్యాల-కరీంనగర్ రోడ్డులోని నర్సింగాపూర్లో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 3D ప్రింటింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. PMKVY 4.0 స్కీమ్లో భాగంగా సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుందని, ఈ కోర్సు 3 నెలలపాటు ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.