మెదక్: కొల్చారం చెరువులో ఒకరి మృతదేహం లభ్యమైన ఘటన నేడు వెలుగు చూసింది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం పట్టణానికి చెందిన సాయికుమార్ బిక్కనూరులో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయారు. గురువారం కొల్చారం చెరువులో అనుమానస్పదంగా స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.