SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద్యార్థులలో పరిశోధనాసక్తిని పెంపొందిస్తాయని కాలేజ్ ప్రిన్సిపాల్ డా జి. సునీత తెలిపారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.