PDPL: శ్రీరాంపూర్ మండలం గంగారం కూరగాయల వారసంతకు ఈనెల 30న ఉదయం 10:30 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి షాహాబుద్దీన్ తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు రూ. 100 డిపాజిట్ చెల్లించాలన్నారు. పాటలో నెగ్గిన వారు అదే రోజు సగం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని సూచించారు.