WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి హాజరై మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.