JN: దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి పాఠశాల బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. జిల్లా విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుల పాత్రల్లో విద్యార్థులు ఒదిగిపోయి విధులను నిర్వర్తించారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.