ADB: అందరి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.