KNR: కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో CPI జిల్లా సమితి ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ 208వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, వి.ఎస్. బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసఫ్, వాసిరెడ్డి పాల్గొన్నారు.