KMM: కల్లూరు మండలం లింగాల గ్రామ సర్పంచ్ వేము కృష్ణ తండ్రి అజరయ్య ఆదివారం రాత్రి మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ లోక్సభపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వెంటనే స్పందించి సర్పంచ్ కృష్ణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా అజరయ్య మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.