MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం (R&R) కోసం ప్రభుత్వం మరో రూ.150 కోట్లు విడుదల చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీనితో ఇప్పటివరకు విడుదలైన మొత్తం రూ.400 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్యాకేజీ నిధుల పంపిణీ వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.