KMR: మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురువారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్థుల ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ డ్రైవర్లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రవాణా కష్టాలు తీరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.