NRPT: మద్దూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఇస్తామని ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేశారని దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మైపాల్ మండిపడ్డారు. గోవిందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగినందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ముదిరాజ్ బిడ్డలపై లాఠీ ఛార్జ్ చేయించడం తగదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.