భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.