GDWL: ఎండలు మండుతున్నా ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలకు తాగడానికి చుక్క నీరు కూడా లేకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ విమర్శించారు. శుక్రవారం ధరూరు మండలంలోని యమునోనిపల్లి, పెద్దపాడు, గూడెందొడ్డి తదితర గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించిన ఆయన, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.