విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖకు రానున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ను అధికారికంగా జిల్లా అధికారులు వెల్లడించారు. సోమవార సీఎం ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రికి నగరంలోనే బస చేసి, గూగుల్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటలకు పోర్టు అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారు.