ASF: జైనూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MRO ఆడ బిర్షవ్ ప్రకటనలో తెలిపారు. గత నవంబర్లో అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు, ఇతరులు ఈ వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. వివరాల కోసం MRO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.