PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2026 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా పురస్కారం’ వరించింది. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ‘మధురిమలు’ కవితా ప్రక్రియ ప్రోత్సాహం గుర్తించామన్నారు.