KMM: హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని పీఏసీఎస్ ఛైర్మన్లు ఇవాళ తిరిగి తమ పదవులను చేపట్టారు. పైనంపల్లిలో డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావుతో పాటు పలువురు ఛైర్మన్లు విధుల్లో చేరారు. న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా, మరింత ఉత్సాహంతో సేవలు అందిస్తామని వారు స్పష్టం చేశారు.