SRCL: రెవెన్యూ అధికారిగా రమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయిలు కూడా బదిలీ అయ్యారు. వెంకటేశ్వర్లు జనగామ డీఆర్వోగా బదిలీ కాగా, రాధాభాయిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవోగా రాజేందర్ రెడ్డిని, VMWD ఆర్డీవోగా కేఎస్బీ కుమారిని నియమించారు.