NRML: రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ గంటముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా డీఈవో భోజన్న తెలిపారు. పదో తరగతి పరీక్షలకు నిమిషం నిబంధన అమలులో లేదని 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా ఐదు నిమిషాల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.