NRPT: నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి, లంకాల గ్రామాల్లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు గురువారం భూమిపూజ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఎంపీ నిధులతో ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల రాత్రి వేళల్లో గ్రామాల్లో వెలుగుల సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.