KMM: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి, విక్రయిస్తామని నమ్మబలికిన ముగ్గురు నిందితులను ఖానాపురం హవేలీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసి మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఖమ్మం CP కోరారు.