NZB: బోధన్ శివారులోని సేవాలాల్ జయంతి వేడుకలో ఆదివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మ పాల్గొన్నారు. బంజారాలతో కలిసి వారు ఉత్సాహంగా ఆడిపాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, బంజారాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.