MNCL: జన్నారం మండలంలోని మీ-సేవ కేంద్రాల పనితీరుపై నూతన తహసీల్దార్ జి. బక్కయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో బాధ్యతలు చేపట్టిన ఆయన, మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న మీ-సేవ కేంద్రాల తీరుపై సమీక్ష నిర్వహించి, నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.