SRCL: ఇల్లంతకుంట మండలం నేడురేపాకలో సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంపై ఎస్సై లక్పతి, కార్యదర్శి ప్రవీణ్ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.