SGR: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలో ప్రీ ప్రైమరీ టీచర్ల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను ఫ్రీ ప్రైమరీలో చేర్పించాలన్నారు.