NRML: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 31 వరకు సదరం వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని డిఆర్డిఓ విజయలక్ష్మి ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తో, ఇతర దివ్యాంగులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని స్లాట్ బుక్ చేసుకుని మొబైల్కు సమాచారం వచ్చిన దివ్యాంగులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.