JN: ప్రపంచ మెంటల్ హెల్త్ డే సందర్భంగా తరిగొప్పుల కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలకు ఆరోగ్య జీవనం, పౌష్టికాహారం, వ్యాయామం, చదువు, సెల్ ఫోన్ పరిమితి, పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై సీనియర్ సివిల్ జడ్జ్ విక్రమ్ అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.